అర్హులైన అందరికీ సాయం అందించబోతున్నాం: చిరంజీవి

ABN , First Publish Date - 2020-04-08T01:22:46+05:30 IST

ప్రజలకు ఏ విపత్తు వాటిల్లినా మేమున్నామంటూ తెలుగు సినిమా రంగం ముందుంటుంది. కరోనా క్రైసిస్‌లోనూ అలాగే ఉంది....

అర్హులైన అందరికీ సాయం అందించబోతున్నాం: చిరంజీవి

హైదరాబాద్: ప్రజలకు ఏ విపత్తు వాటిల్లినా మేమున్నామంటూ తెలుగు సినిమా రంగం ముందుంటుంది. కరోనా క్రైసిస్ లోనూ అలాగే ఉంది. రెక్కాడితే కానీ, డొక్కాడని సినీ కార్మికుల పరిస్థితి చెప్పర్లరేదు. వారిని ఆదుకోవడం కోసమే వెలిసింది కరోనా క్రైసిస్ చారిటీ. మెగాస్టార్ చిరంజీవి ఆలోచనలో నుంచి పుట్టిన దీన్ని ఆయనే ముందుండి నేతృత్వం వహిస్తున్నారు.  ఈ నేపథ్యంలో చిరంజీవి ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.


ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘‘సినీ కార్మికులు ఏ రోజుకు ఆరోజు పని చేసి బత్తా తీసుకుంటారు. లాక్ డౌన్ నేపథ్యంలో వర్క్ లేకపోయే సరికి వారి చేతుల్లో డబ్బులులేవు. వాళ్ల పరిస్థితులను తలుచుకుంటే చాలా బాధాకరం. ప్రభుత్వాలకు ఎలాగో తమ వంతుగా విరాళాలు ఇస్తాం. కేంద్ర ప్రభుత్వానికి, తెలుగు ప్రభుత్వాలకు మా కుటుంబం నుంచి విరాళాలు ఇచ్చాం. సినీ కార్మికులకు నా వంతుగా చేయూతను అందిస్తే బాగుంటుందన్న ఆలోచనతో చారిటీ ప్రారంభించాం. నా తోటి హీరోలు కూడా స్పందించారు. అర్హులైన అందరికీ సాయం అందిస్తాం. దాదాపు 10 వేల మందికి సాయం చోయబోతున్నాం. అందరూ ఇళ్లకే పరిమితం కావాలి. వేసవి అయిపోయేలోగా కరోనా ముగింపు వస్తుందని ఆశిస్తున్నా. త్వరలోనే మళ్లీ మునుపటి వాతావరణం నెలకొంటుందని భావిస్తున్నా. లాక్ డౌన్‌తో ప్రకృతి గొప్పతనం తెలుసుకున్నా.’’ అని అన్నారు. 


Updated Date - 2020-04-08T01:22:46+05:30 IST