ఫోన్లో తమ్మారెడ్డిని పరామర్శించిన చిరంజీవి
ABN , First Publish Date - 2020-04-07T00:48:08+05:30 IST
ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాతృమూర్తి కృష్ణవేణి (94) సోమవారం మృతి చెందారు. కృష్ణవేణి మరణ వార్త తెలిసిన వెంటనే
![ఫోన్లో తమ్మారెడ్డిని పరామర్శించిన చిరంజీవి](https://media.chitrajyothy.com/appimg/galleries/2020040606524315/04062020185602n43.jpg)
ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాతృమూర్తి కృష్ణవేణి (94) సోమవారం మృతి చెందారు. కృష్ణవేణి మరణ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి ఫోన్లో భరద్వాజను పరామర్శించారు, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంతాప సందేశాన్ని తెలియజేశారు. సినిమా ఒక మజిలీ.. సమ సమాజం నా అంతిమ లక్ష్యం అనే కృష్ణమూర్తి తెలుగు సినిమా పరిశ్రమకు ఇతోదిక సేవలందించారని గుర్తుచేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.
మాతృమూర్తిని కోల్పోయిన తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. అనారోగ్యంతో తన తల్లి రెండు నెలలుగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తన మిత్రులు, శ్రేయోభిలాషులు చాలా మంది ఫోన్లు చేస్తున్నారని, కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున తనను పరామర్శించడానికి ఎవరూ ఇంటికి రావద్దని ఆయన కోరారు.