‘ప్రతీరోజూ నిన్ను మిస్ అవుతున్నా’ తల్లిని గుర్తుచేసుకున్న జాన్వీ!
ABN, First Publish Date - 2020-02-24T16:44:48+05:30
ఫిబ్రవరి 24.... మహానటి శ్రీదేవి మరణించి నేటికి రెండేళ్లు పూర్తయ్యాయి. 2018లో శ్రీదేవి కన్నుమూసినప్పటికీ, ఈ నాటికి ఆమె మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఫిబ్రవరి 24.... మహానటి శ్రీదేవి మరణించి నేటికి రెండేళ్లు పూర్తయ్యాయి. 2018లో శ్రీదేవి కన్నుమూసినప్పటికీ, ఈ నాటికి ఆమె మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవి రెండవ వర్ధంతి సందర్భంగా ఆమె కుమార్తె జాన్వీకపూర్ ఒక పోస్ట్ చేశారు. జాన్వీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తన తల్లితో పాటు ఉన్న ఒక ఫోటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో జాన్వీ తన తల్లి శ్రీదేవిని ఆలింగనం చేసుకుని కనిపిస్తోంది. ఆ ఫోటో కింద జాన్వీ ‘నేను నిన్ను ప్రతీరోజూ మిస్ అవుతున్నానని’ రాసింది. ఈ ఫొటోను చూసిన జాన్వీ అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు.