శ్రేయాస్ ఈటీలో ‘బ్లూ ఐస్’ రిలీజ్.. ఎప్పుడంటే
ABN , First Publish Date - 2020-08-27T22:22:12+05:30 IST
డిజిటల్ వరల్డ్లో ప్రస్తుతం మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు భారీ స్థాయిలో క్రేజ్ అందుతోంది. డబ్బింగ్ సినిమాలు కూడా ఓటీటీ మార్కెట్లో ఎగబడి చూసేస్తున్నారు. ఇక సస్పెన్స్ థ్రిల్లర్
![శ్రేయాస్ ఈటీలో ‘బ్లూ ఐస్’ రిలీజ్.. ఎప్పుడంటే](https://media.chitrajyothy.com/appimg/galleries/2020082704494037/08272020165204n48.jpg)
డిజిటల్ వరల్డ్లో ప్రస్తుతం మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు భారీ స్థాయిలో క్రేజ్ అందుతోంది. డబ్బింగ్ సినిమాలు కూడా ఓటీటీ మార్కెట్లో ఎగబడి చూసేస్తున్నారు. ఇక సస్పెన్స్ థ్రిల్లర్ వంటి చిత్రాలకు హై డిమాండ్ ఏర్పడుతోంది. అలాంటి సినిమా ఒకటి త్వరలో విడుదల కాబోతోంది. ఆఫ్రీన్ సిద్ధు, నాస్టియా రాయ్, నిశాంత్ వాలియా, ఆర్జే పృథ్వీ వంటి నటీనటులు నటించిన చిత్రం ‘బ్లూ ఐస్’. ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి స్పందనను రాబట్టుకున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఆగస్ట్ 29న శ్రేయాస్ ఈటీలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లుగా నిర్మాత ప్రకటించారు.
రాధా మాధవి ప్రొడక్షన్స్, రవళి చౌదరి సమర్పణలో మాదాల రామకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి రాజేష్ మూర్తి దర్శకుడు. సంగీతం ఎమ్.అనిరుధ్ అందించాడు. ఈ థ్రిల్లర్లో స్నేహితురాలు దుర్భరమైన పరిస్థితులలో చనిపోయినట్లు తెలుసుకున్న రోహిత్ హంతకుడిని తెలుసుకోవడానికి మోనికా సహాయం తీసుకుంటాడు. ఆమె, ఒక మనోరోగ వైద్యుడితో కలిసి, దారుణ హత్య రహస్యాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఇదే సినిమాలో అసలు పాయింట్. సినిమాలో థ్రిల్లింగ్గా అనిపించే అంశాలు చాలానే ఉంటాయని, ఇదివరకే రిలీజైన బ్లూ ఐస్ ట్రైలర్కు అద్భుతమైన స్పందన వచ్చిందని, విడుదల లోపు మరో ట్రైలర్ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ తెలిపింది.
ఈ సందర్భంగా నిర్మాత మాదాల రామకృష్ణ మాట్లాడుతూ.. ‘‘బ్లూ ఐస్ చిత్ర ట్రైలర్కు విశేష స్పందన వస్తోంది. ఈనెల 29న శ్రేయాస్ ఈటీలో మా చిత్రం విడుదల కాబోతోంది. శ్రేయాస్ యాప్లో మా సినిమా చూడటానికి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రోజుకు 150 నుండి 200 మంది బుక్ చేసుకుంటున్నారు. విడుదల లోపు మరో కొత్త ట్రైలర్ను విడుదల చేయనున్నాము..’’ అని తెలిపారు.
![](https://media.chitrajyothy.com/appimg/galleries/2020082704494037/08272020191738n56.jpg)