కరణం మల్లీశ్వరి జీవితచిత్రం
ABN , First Publish Date - 2020-06-02T04:44:30+05:30 IST
ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ, తెలుగు నేలపై జన్మించి చరిత్ర సృష్టించిన కరణం మల్లీశ్వరి జీవితంపై ఓ సినిమా రానుంది. ఈ బయోపిక్కు సంజనారెడ్డి దర్శకురాలు...

ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ, తెలుగు నేలపై జన్మించి చరిత్ర సృష్టించిన కరణం మల్లీశ్వరి జీవితంపై ఓ సినిమా రానుంది. ఈ బయోపిక్కు సంజనారెడ్డి దర్శకురాలు. కోన వెంకట్ రచయిత. ఎంవివి సత్యనారాయణతో కలిసి ఆయనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరణం మల్లీశ్వరి పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఈ చిత్రాన్ని ప్రకటించారు. త్వరలో నటీనటులు, ఇతర సాంకేతిన నిపుణుల వివరాలు వెల్లడిస్తామన్నారు. ఒలింపిక్స్-2000లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కరణం మల్లీశ్వరి కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే.