పుష్కరంన్నర పూర్తి చేసుకున్న ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’

ABN , First Publish Date - 2020-08-03T02:07:01+05:30 IST

గ్రేట్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో మహర్షి సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత వల్లూరిపల్లి రమేష్ నిర్మించగా.. మంచి విజయం సాధించిన ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ చిత్రం

పుష్కరంన్నర పూర్తి చేసుకున్న ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’

గ్రేట్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో మహర్షి సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత వల్లూరిపల్లి రమేష్ నిర్మించగా.. మంచి విజయం సాధించిన ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ చిత్రం నేటితో(ఆగస్ట్ 2) 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. రవితేజ కెరీర్‌లో అత్యంత విభిన్నమైన చిత్రంగా నిలిచిన ఈ చిత్రానికి స్వర్గీయ చక్రి తన సంగీతంతో జీవం పోశారు. చిత్రంలోని అన్ని పాటలు పెద్ద హిట్. కల్యాణి హీరోయిన్‌గా నటించింది. 


కథ విషయానికి వస్తే.. కల్యాణి పగలు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటుంది. రవితేజ రాత్రి వర్క్ చేస్తూ.. పగలు ఇంటిలోనే ఉంటాడు. అయితే కల్యాణి ఉండే ఇంటినే రవితేజకు కూడా అద్దెకు ఇస్తాడు ఇంటి ఓనర్. వీరిద్దరూ విడిగా కలుసుకుంటూ ఉంటారు కానీ, తన ఇంట్లో ఉండేది రవితేజ అనే విషయం కల్యాణికి తెలియదు. తర్వాత రవితేజకు తెలిసినా.. కల్యాణికి చెప్పకుండా సర్‌ప్రైజ్ చేయాలని అనుకుంటాడు. అనుకోకుండా వీరిద్దరూ లవ్‌లో పడతారు. అప్పుడు కల్యాణి వైపు నుంచి ఓ ట్విస్ట్. చివరికి వీరిద్దరూ కలుసుకుని కథ సుఖాంతం అవుతుంది. అయితే వంశీ కామెడీ మార్క్‌తో ఆద్యంతం ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది. ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తుంది. చిత్రం పుష్కరంన్నర పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రయూనిట్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. 

Updated Date - 2020-08-03T02:07:01+05:30 IST