సుబ్బరాజు ఛాలెంజ్ని స్వీకరించిన అల్లరి నరేష్
ABN , First Publish Date - 2020-07-27T02:51:46+05:30 IST
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే కాకుండా బాధ్యత తీసుకోని ఇతరుల చేత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను పూర్తి చేయించడం జరుగుతుంది. తాజాగా ఈ ఛాలెంజ్లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్లు పాల్గొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు నటుడు సుబ్బరాజు ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో అల్లరి నరేష్ పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి గొప్ప కార్యక్రమంలో నన్నూ భాగం చేసిన సుబ్బరాజుకు ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళుతూ.. అందరిలో స్ఫూర్తి నింపుతున్న సంతోష్ కుమార్గారికి కృతజ్ఞతలు. మొక్కలు నాటడం ద్వారా ప్రకృతికి మేలు చేసిన వాళ్లమవుతాం. ప్రస్తుతం అందరికీ ప్రకృతి యొక్క గొప్పతనం తెలిసివచ్చింది. అందుకే అందరూ మొక్కలు నాటి ప్రకృతిని పచ్చదనంతో నింపుదాం. నేను కూడా ఈ ఛాలెంజ్కు హీరో నాని, సింగర్ స్మిత, డైరెక్టర్ దేవా కట్టలను నామినేట్ చేస్తున్నాను. అలాగే నా అభిమానులందరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాల్సిందిగా కోరుతున్నాను..’’ అని తెలిపారు.