థియేటర్లలో ఆ అగ్రహీరో సినిమా విడుదల... కానీ మనం చూడలేం!
ABN , First Publish Date - 2020-10-01T13:13:01+05:30 IST
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘లక్ష్మీ బాంబ్’ సినిమాపై ప్రేక్షకుల్లో చాలా అంచనాలున్నాయి. ఈ సినిమాను థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయాలని భావించారు. అయితే కరోనా కారణంగా ఓటీటీ ప్లాట్ఫారంపై విడుదల చేస్తున్నారు. ఈ సినిమా...
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘లక్ష్మీ బాంబ్’ సినిమాపై ప్రేక్షకుల్లో చాలా అంచనాలున్నాయి. ఈ సినిమాను థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయాలని భావించారు. అయితే కరోనా కారణంగా ఓటీటీ ప్లాట్ఫారంపై విడుదల చేస్తున్నారు. ఈ సినిమా చూసేందుకు అక్షయ్ ఫ్యాన్స్ తహతహలాడిపోతున్నారు. అయితే ఈ సినిమా భారత్లోని థియేటర్లలో విడుదల కాకపోయినా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూఏఈ తదితర దేశాలలో వెండితెరపై విడుదల కానుంది.
నవంబరు 9న ‘లక్ష్మీ బాంబ్’ సినిమా ఈ దేశాలలోని థియేటర్లలో విడుదల కానుంది. ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా అదేరోజున ఈ సినిమా డిస్నీ హాట్స్టార్లో విడుదల కానుంది. ‘లక్ష్మీబాంబ్’ సినిమాలో అక్షయ్ కుమార్ హిజ్రాగా కనిపించనున్నారు. దీనికిముందు కూడా అక్షయ్ ఇటువంటి పాత్రలు చేశారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, తుషార్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.