నటుడు యాదాకృష్ణ ఆకస్మిక మరణం
ABN , First Publish Date - 2020-12-03T05:44:31+05:30 IST
పాతికేళ్ల క్రితమే ‘తెలంగాణ హీరో’గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, నిర్మాత యాదాకృష్ణ..
![నటుడు యాదాకృష్ణ ఆకస్మిక మరణం](https://media.chitrajyothy.com/appimg/galleries/2020120312005347/12032020001259n20.jpg)
పాతికేళ్ల క్రితమే ‘తెలంగాణ హీరో’గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, నిర్మాత యాదాకృష్ణ (61) బుధవారం ఉదయం హైదరాబాద్లో గుండెపోటుతో మరణించారు. జేఎన్టీయూలో ఉద్యోగిగా పనిచేస్తూ పదవీ విరమణ చేసిన యాదాకృష్ణకు మొదటినుంచీ సినిమాలంటే ఆసక్తి. ఒకపక్క ఉద్యోగం చేస్తూనే టీవీ సీరియల్స్లో , సినిమాల్లో నటిస్తుండేవారు. ‘శృంగార పురుషుడు’, ‘ఇరుకింట్లో ఇద్దరు పెళ్లాలు’ సహా ఇరవై చిత్రాల్లో ఆయన హీరోగా నటించారు. ఆయన చివరి చిత్రం ‘సంక్రాంతి అల్లుడు’. ఆ తర్వాత మరో కొత్త చిత్రం నిర్మించాలని ఇటీవలే సన్నాహాలు ప్రారంభించారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.